మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరా సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు మరో వందరోజులు మాత్రమే సమయం వుంది. అంత భారీ సినిమాకు ప్రచారం ఓ పద్దతి ప్రకారం ముందుగా చేసుకుంటూ వెళ్లాలి. కానీ సాహో సినిమా మిస్ అయింది ఇక్కడే.రామ్ చరణ్ తన సైరా సినిమా కోసం మాత్రం ప్రచారం విషయంలో పక్కా ప్లాన్డ్ గా వెళ్తున్నాడని తెలుస్తోంది .

తొలిసారి ఇన్ స్టా గ్రామ్ లో అకౌంట్ తెరిచాడు మెగా పవర్ స్టార్. అతిత్వరలో సైరా గురించి ఓ మాంచి అప్ డేట్ ఈ అకౌంట్ ద్వారా ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, సైరా గురించి వరుసగా అప్ డేట్ లు అన్నీ ఈ అకౌంట్ ద్వారానే ఇవ్వబోతున్నాడట. ఇది మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.
న్నాళ్లూ రామ్ చరణ్ తరపున అతని శ్రీమతి ఉపాసననే సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా వుంటూ వస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ నేరుగా స్టార్ట్ చేసారు. సైరా సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా. పైగా ఈ సినిమాకి నిర్మాత కూడా రామ్ చరణే. అందుకే ప్రచారం గురించి, మార్కెటింగ్ గురించి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, నయనతార, తమన్న తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: