కొన్నాళ్లుగా అసలు ఏమాత్రం ఫాం లో లేని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఫైనల్ గా కబీర్ సింగ్ రూపంలో సంచలన విజయం అందుకున్నాడు. తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డికి రీమేక్ గా మాత్రుక దర్శకుడు సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ లో వసూళ్ల హంగామా సృష్టిస్తుంది.


ఇప్పటి వరకు 239 కోట్ల షేర్ రాబట్టిన కబీర్ సింగ్ ఫుల్ రన్ లో 300 కోట్ల పైగా వసూళ్లు తెచ్చేలా ఉంది. ఇక ఈ సినిమా ఈ ఇయర్ రిలీజైన సినిమాల కన్నా హయ్యెస్ట్ కలక్షన్స్ సాధిస్తుంది. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు బాహుబలి, దంగల్, పీకే, యూరి చిత్రాల తర్వాత కబీర్ సింగ్ నిలిచింది.


సల్మాన్ ఖాన్ నటించిన భారత్, రణ్ వీర్ సింగ్ నటించిన సింబా మూవీ కలక్షన్స్ క్రాస్ చేసింది కబీర్ సింగ్. సరైన సినిమా పడితే షాహిద్ కపూర్ సత్తా ఏంటన్నది కబీర్ సింగ్ నిరూపించింది. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన కబీర్ సింగ్ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయో వివాదాలు అలానే ఉన్నాయి.


సినిమా రిలీజైన దగ్గర నుండి కబీర్ సింగ్ పై నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవిధంగా ఈ నెగటివ్ కామెంట్స్ సినిమా మీద ఎక్కువ ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. సినిమాలో షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఫైనల్ గా ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న షాహిద్ కబీర్ సింగ్ తో హిట్ ట్రాక్ ఎక్కేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: