టాలీవుడ్ లో మూడేళ్ల క్రితం సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయన’ మన్మధుడు నాగార్జున సందడి చేసిన విషయం తెలిసిందే.  అప్పట్లో టాప్ మూవీస్ తో పోటీ పడీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం..కలెక్షన్లు రాబట్టడం జరిగింది. ఈ మూవీ సీక్వెల్ గా అందులో పాపులర్ అయిన పాత్ర ‘బంగార్రాజు’ టైటిల్ తో తెరెక్కించబోతున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ మూవీకి దర్శకత్వం కల్యాణ్‌ కృష్ణ వహించబోతున్నట్టు ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది.  ప్రస్తుతం రాహూల్ రవీంద్ర, నాగార్జున కాంబినేషన్ లో మన్మథుడు మూవీ సీక్వెల్ ‘మన్మథుడు2’ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో ముఖ్యపాత్రలో సీనియర్ నటి లక్ష్మీ నటిస్తుంది. ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్, రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.

అయితే బంగార్రాజు మూవీ కోసం హీరోయిన్లు కూడా కన్ఫామ్ చేశారు.  ఈ మూవీలో నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఈ మూవీకి కొద్ది కాలం పాటు బ్రేకప్ చెప్పబోతున్నట్లు సీనీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. 'బిగ్ బాస్ 3'కి హోస్ట్ గా వ్యవహరించనున్న కారణంగా, నాగార్జున ఓ మూడు నెలల పాటు బిజీగా వుంటారు.

అందువలన ఆ తరువాతనే 'బంగార్రాజు' ప్రాజెక్టును పట్టాలెక్కించే ఆలోచనలో ఆయన వున్నారని సమాచారం. ఈ సినిమాను ఆయన వచ్చే వేసవి సెలవులకి విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇదే జరిగితే వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: