టాలీవుడ్ హీరోల్లో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న నాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో గ్యాంగ్ లీడర్, మరియు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న వి అనే సినిమాలో ఒక కీలక క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఇక ఓవైపు సినీమాల్లో నటిస్తున్న నాని, ఇటీవల కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటించిన 'అ' అనే విభిన్న తరహా సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే. 

ఇక ప్రస్తుతం నాని, మరొక సినిమాని నిర్మించాలని ఆలోచిస్తున్నాడట. ఇటీవల నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా తనకు ఎంతో నచ్చిందని, ఆకట్టుకునే కథ మరియు కథనాలతో దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించాడని, నాని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పొగడ్తలు కురిపించాడు. అయితే ప్రస్తుతం నాని, ఆ సినిమాకు సీక్వెల్ ని నిర్మించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. హీరో మరియు దర్శకుడు సహా దాదాపుగా అదే టీమ్ ని తన సీక్వెల్ కి కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాడట నాని. అయితే ఈ విషయమై కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవేమిటంటే, 

టాలీవుడ్ లో ఒక్క బాహుబలి తప్పించి, ఇప్పటివరకు వచ్చిన దాదాపుగా ఏ సినిమా సీక్వెల్ కూడా పెద్దగా సక్సెస్ సాధించకపోవడం,తో నాని ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాను అంటూ ముందుకువచ్చి వేస్తున్న స్టెప్ పెద్ద రిస్క్ చేయడమే అని పలువురు అభిప్రాయం పడుతున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన సీక్వెల్స్ తెలుగులో పెద్దగా అడనప్పటికీ, దర్శకుడు మొదటి సినిమా మాదిరిగా ఈసారి తీయబోయే ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ పై గట్టిగా దృష్టిపెట్టి తీస్తే మంచి హిట్ లభించే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: