సాహో సినిమాలో బాలీవుడ్ వాసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన వీడియో సాంగ్ లో కూడా ఆ లిరిక్స్ చూసి మనోళ్లకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏదో సైకో సయ్యా అని ఆడియో సింగల్ ని వీడియోతో సహా విడుదల చేశారు. ఇప్పటికీ అది హిందీ పాటా తెలుగు సాంగా అర్థం కాక ఫాన్సే రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఇక సామాన్య ప్రేక్షకులు ఒక్కసారికే పెదవి విరిచారు.


ఇదంతా సాహోకు ప్లస్ అయ్యే అంశం కాదు. చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎంత యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయినా అంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ని ఎందుకు తీసుకున్నారన్న కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. టీజర్ లో సైతం వెన్నెల కిషోర్ లాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే మొత్తం బాలీవుడ్ బ్యాచే సినిమా మొత్తం నిండిపోయింది. బాహుబలికి రాజమౌళి ఈ ఫార్ములా ఫాలో కాలేదు. కేవలం తెలుగు తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని క్యాస్టింగ్ సెట్ చేసుకున్నాడు తప్ప పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి  అనవరసంగా హిందీ తారల వెంట పడలేదు. కానీ సాహోకు జరుగుతున్నది వేరు.


తీస్తోందే హిందీ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది. ఇదంతా పోవాలంటే అర్జెంటు గా సాహో ప్రమోషన్ స్ట్రాటజీ మార్చాలి. రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా అనే సానుభూతితో జనం సినిమాకు రారు. ఫైనల్ గా కంటెంటే ముఖ్యం. అది లేకుండా వెయ్యి కోట్లు పెట్టినా లాభం ఉండదు. అందుకే సాహో రెండేళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి అంటే సౌత్ లో అందులోనూ తెలుగు ప్రేక్షకులకు ఇది మన సినిమానే అనే ఫీలింగ్ ఇంకా బలంగా కలిగేలా రూటు మార్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: