చాలా అద్భుతంగా పాత్ర‌ల‌ను క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు న్యాచ‌ర‌ల్ క‌థ‌ల‌ను డైరెక్ట్ చేయ‌డంలో శేఖ‌ర్ క‌మ్ములకి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఎంతో అద్భుత‌మైన నేచ‌రాలిటీతో పాత్ర‌ల‌ను తీర్చిదిద్దుతారు ఆ పాత్ర‌లు చూడ‌డానికి ఎలా ఉంటాయంటే రోజూ మ‌న‌తో తిరిగే క్యారెక్ట‌ర్స్ లానే ఉంటాయి అదే శేఖ‌ర్‌క‌మ్ముల స్పెషాలిటీ. ఆయ‌న చేసే చిత్రాలు చాలా మ‌టుకు రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా అనిపిస్తాయి. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ సెకెండ్ వీక్ లో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో క్రిస్టమస్ సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు.


కాగా ఈ సినిమాను అతి తక్కువ టైమ్ లో కేవలం 60 -70 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ఇక డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక నాగ‌చైత‌న్య‌, వెంక‌టేష్ న‌టించే వెంకీమామ చిత్రం  క్ల‌యిమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. బ‌హుశా పూర్త‌వ‌గానే చైతూ ఈ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోతార‌న‌మాట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: