టాలీవుడ్ లో చాలా తక్కువ మంది అచ్చమైన తెలుగు హీరోయిన్లు ఉంటారంటారు.  వాస్తవానికి సినిమాకు కావాల్సిన గ్లామర్ ఇతర భాష హీరోయిన్లు మాత్రమే చేస్తారని మొదటి నుంచి వినిపిస్తున్న మాటలే.  ఇక బాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్లు విచ్చలవిడిగా అందాల ఆరబోత, లిప్ లాక్, బికినీ సీన్లలో నటిస్తుంటారు. ఈ సాహసాలు మాత్రం తెలుగు హీరోయిన్లు చేయలేరని టాలీవుడ్ టాక్.  కానీ ఈ మద్య వస్తున్న తెలుగు హీరోయిన్లు అన్నింటికి తాము కూడా ఓకే అని చెబుతున్నారు. 

తాజాగా ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్..కానీ ఈ అమ్మడికి మాత్రం తెలుగు పెద్దగా ఛాన్సులు రావడం లేదు. ఏవో అప్పుడప్పుడు చేసినా చితకా ఉండే అవకాశాలే తప్పించి మంచి అవకాశాలు రావడం లేదు .ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అరవింద సమేత వచ్చింది. పాత్ర చిన్నదే పెద్దగా ప్రాధాన్యత లేదు. ఆ మద్య సుమంత్ నటించిన సుబ్రమణ్యపురం సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈమెపై దర్శక,నిర్మాతల దృష్టి పడిందని అంటున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి  దర్శకత్వంలో  ‘రాగల 24 గంటల్లో’ అనే సినిమా చేస్తున్నది. 

ఈ సినిమాతో కాస్త మంచి పేరు తో పాటు గ్లామర్ ప్రదర్శన కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాగల 24 గంటల్లో సినిమాలో బికినీ తో కూడా యాక్ట్ చేయడానికి సిద్దమయిపోయింది. ఇందులో ఫస్ట్ సీన్ ను స్విమ్మింగ్ పూల్ లో షూట్ అనుకుంటున్నారట.ఈ సీన్ కూడా ఏదో వచ్చిందా పోయిందా అన్నట్టు కాకుండా సినిమాలో ఈ సీన్ కి చాలా ప్రాధాన్యత ఉండేటట్లు తీస్తారట. ఈ సినిమాతోనైనా ఈ తెలుగు అమ్మాయికి మంచి ఛాన్సులు వస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: