డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ విజయవాడలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు పాల్గొన్నారు. సినిమా రిలీజ్ కు కేవలం ఇంకా పదిరోజులు మాత్రమే ఉండటంతో ఇస్మార్ట్  హడావుడి బాగానే మొదలైంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్‌.. ‘విజయవాడ రావడం సంతోషంగా ఉంది. మా సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రామ్, పూరీల సినిమాగా మీడియానే మంచి ప్రచారం ఇస్తోంది అంటూ ఇస్మార్ట్ గా మీడీయాను పొగుడుతున్నాడు. ఇక జగడం తర్వాత నేను పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇదే. సినిమాలో క్యారెక్టర్ విధానం‌ బట్టి భాష ఉంటుంది. అంతే తప్ప కావాలని పెట్టింది కాదని అన్నాడు.  

సినిమాలకు భాష, ప్రాంతాలు ఉండవు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. దర్శకుడు పూరీ లాటరీ లాంటి వారు. కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల చేస్తున్నాం.. కథ కోసమే ఇద్దరు హీరోయిన్లతో నటించాను. ఈ సినిమా అన్ని వర్గాల‌ వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు. మరి వరుస ఫ్లాప్ లతో ఉన్న దర్శకుడు, హీరో..హీరోయిన్స్ కి ఈ సినిమా ఎలాంటి సక్సస్ ను ఇస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: