సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఓ బేబీ. ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా మెప్పిస్తోంది. అంతేకాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఓ బేబీని రీమేక్‌ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని లేటెస్ట్ అప్‌డేట్.

తెలుగులో ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ బాలీవుడ్‌ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్‌ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించటంతో పాటు ఓ కీలక పాత్రలో నటించేందుకు రానా దగ్గుబాటి సిద్ధమవుతున్నట్టుగా ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సమంత పాత్రకు కంగనా రనౌత్ లేదా అలియా భట్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రావూ రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, లక్ష్మీ, తేజలు కీలక పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాలికి యవ్వనం తిరిగి వస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి. ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్‌ను సైతం అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి అటు కొరియన్ లో ఇటు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి సక్సస్ ను తెచ్చుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: