ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కడ చూసినా కబీర్ సింగ్ గురించే చర్చ జరుగుతోంది. సల్మాన్ ఖాన్ అంతటి టాప్ స్టారే తన సినిమా భారత్ ను సరిగ్గా రెండు వారాలు కూడా స్టడీగా నిలపడానికి నానా కష్టాలు పడితే, మీడియం రేంజ్ కి ఓ మెట్టు కిందే ఉండే షాహిద్ కపూర్ సినిమా ఏకంగా 300 కోట్లను టార్గెట్ చేసి మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటం బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగా. వివాదాలు దాని మీద డిస్కషన్లు ఇవన్నీ పక్కనపెడితే షాహిద్ కపూర్ మార్కెట్ ని అమాంతం పెంచడంలో మాత్రం సందీప్ పాత్రే కీలకంగా నిలిచింది.

కబీర్ సింగ్ దెబ్బకు షాహిద్ కపూర్ తన రెమ్యునరేషన్ ఏకంగా 35 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడని ముంబై మీడియాలో పెద్ద టాకే నడుస్తోంది. మొన్నటిదాకా ఇది షాహిద్ కలలో కూడా ఊహించని రెమ్యునిరేషన్ . ఇంత డిమాండ్ వస్తుందని అసలు అనుకున్నాడో లేదో. తనే కాదు కబీర్ సింగ్ దెబ్బకు కియారా అద్వానీ రేంజ్ మాములుగా పెరగలేదు. కెరీర్ పరంగా గుర్తింపు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం స్టార్ల సరసన చేరిపోయింది. తన పారితోషికం ఎంతనే లీక్ బయటికి రాలేదు. కానీ ప్రస్తుతం తన డిమాండ్ చేస్తున్న మొత్తం భారీగానే ఉందని సమాచారం.

వీళ్ళకే ఇలా ఉంటే ఇక సందీప్ వంగా పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. సల్మాన్ ఖాన్ నుంచే పిలుపు వచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయికి చేరుకున్నాడో. కానీ సందీప్ వంగా తన నెక్స్ట్ మూవీ మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ ఒక్క సినిమాతో సందీప్ టాలీవుడ్లో విజయ్ దేవరకొండను..బాలీవుడ్‌లో షాహిద్, కియారను స్టార్స్ గా మార్చేశాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: