‘భరత్ అనే నేను’ విడుదలై సంవత్సరం దాటిపోయినా కొరటాల శివ కేవలం చిరంజీవి తనకు ఇచ్చిన మాటకోసం ఎదురు చూస్తూ మెగా స్టార్ తో చేయబోయే ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాడు. వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రారంభం కావలసి ఉన్నా ‘సైరా’ నుండి చిరంజీవి బయటపడటానికి ఆలస్యం జరుగుతున్న పరిస్థుతులలో ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం అవుతుంది అని అంటున్నారు.

ఇప్పటికే టోటల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన కొరటాల ప్రస్తుతం ఈమూవీ నటీనటుల ఎంపిక పై దృష్టి పెడుతూ ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు అన్నవార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీలో చిరంజీవి పక్కన హీరొయిన్ పాత్రలో నయనతార అనుష్క తమన్నా పాత్రలను పరిశీలించినా కొరటాల చిరంజీవి పక్కన ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటె బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఐశ్వర్యా రాయ్ పేరును తెరపైకి తీసుకు వచ్చి ఈ సూచనకు చిరంజీవి అనుమతి కూడ పొందినట్లు టాక్. 

ప్రస్తుతం కొరటాల ఈమూవీ కథను ఐశ్వర్యా రాయ్ కి వివరించి ఆమె డేట్స్ అడిగే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఐశ్వర్యా రాయ్ రజినీకాంత్ తో ‘రోబో’ మూవీలో నటించిన నేపధ్యంలో ఆమెను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని కొరటాల నమ్మకం. దీనితో అమితాబ్ ద్వారా కొరటాల ఐశ్వర్యా రాయ్ అంగీకారం కోసం గట్టి ప్రయత్నాలలో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఈమె హీరోయిన్ గా నటించడానికి చాల కండిషన్స్ పెడుతుంది. 

పారితోషికం 4 కోట్ల వరకు ఉండటమే కాకుండా ఆమె సహాయకులకు ఇచ్చే పారితోషికం నుండి వసతుల విషయం వరకు చాల ఎక్కువ కండిషన్స్ పెడుతుంది అని అంటారు. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు కొరటాల మెగా కాంపౌండ్ అంగీకారంతో రెడీ అవుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈవార్తలు ఇలా లీక్ అవ్వడంతో చిరంజీవి పక్కన ఫ్రెష్ ఫేస్ అంటే ఐశ్వర్యా రాయ్ ఎలా అవుతుంది అంటూ మెగా అభిమానులు అప్పుడే తల పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు చిరంజీవి ఐశ్వర్యల కాంబినేషన్ ఏమాత్రం బాగుండదు అని మెగా అభిమానులు వ్యక్త పరుస్తున్న అభిప్రాయాలు ఎంతవరకు కొరటాల చిరంజీవి సీరియస్ గా తీసుకుంటారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: