అర్జున్ రెడ్డి సినిమా తరువాత టాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ కు మంచి పేరు వచ్చింది.  నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారు అనే ఆలోచన మొదలైంది.  ఈ ఆలోచన అలా ఆ దశలో ఉండగానే బాలీవుడ్ కు వెళ్లి షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.  అక్కడ ఈ మూవీ సంచలన విజయం సాధించింది.  ఇప్పటికే ఈ మూవీ దాదాపుగా 250 కోట్ల వరకు వసూలు చేసింది.  


బాలీవుడ్ టాప్ 10 మూవీస్ లో ఇది ఒకటిగా నిలిచింది.  దీంతో సందీప్ రెడ్డి వంగకు క్రేజ్ పెరిగింది.  సందీప్ తో మరో సినిమా చేయడానికి అటు షాహిద్, టి సిరీస్ లు రెడీ అంటున్నాయి.  సందీప్ మాత్రం టాలీవుడ్ లో నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.  


ఇప్పటికే మహేష్ బాబుకు ఓ కథ వినిపించారట.  కథ బాగుంది స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు సమాచారం.  ప్రస్తుతం సందీప్ అదే పనిమీద ఉన్నారని తెలుస్తోంది.  పక్కాగా స్క్రిప్ట్ పూర్తి చేసి మహేష్ కు వినిపించి సినిమా చేయాలని అనుకుంటున్నాడు సందీప్.  


మహేష్ ప్రసుత్తం 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్నారు.  ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతున్నది.  ఇందులో మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ కనిపిస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను సిద్ధం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: