నయనతార.. సౌత్ ఇండియాను ఏలేస్తున్న క్వీన్. ఆమె ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు గడచిపోయినా ఆ మోజూ, క్రేజూ పోలేదు. ఆమెతో నటించాలని సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ కోరుకుంటారు. ఇక ఆమె తమ సినిమాల్లో ఉండాలని భారీ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. అలాంటిదే ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఇపుడు నయన్ చేతికి వచ్చింది.


ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్, హిందీ చిత్ర నిర్మాతలు మధు మంతేనా, నమిత్‌ మల్హోత్రాలతో కలిసి రామాయణం ఇతిహాసాన్ని మరోసారి కమనీయంగా వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ మహా కావ్యాన్ని త్రీడీ ఫార్మెట్‌లో కనువిందుగా మూడు భాగాలుగా నిర్మించనున్నారు.


 దీనికి బాలీవుడ్‌ చిత్రం దంగల్‌ ఫేమ్‌ నితేశ్‌ తివారి, మామ్‌ చిత్రం ఫేమ్‌ ఉద్యఅవర్‌ కలిసి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దీన్ని ఒక్కో భాగాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందించడానికి  సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 1500 కోట్ల రూపాయలతో తెరకెక్కే ఈ రామాయణం సినిమా చరిత్రలోనే కొత్త రికార్డ్ నెలకొల్పుతుందని అంటున్నారు.


ఈ భారీ మూవీలో సీత పాత్రకు నయనతారను అనుకుంటున్నారుట. బాలయ్య బాపు మూవీ శ్రీ రామరాజ్యంలో సీతగా  అద్భుతంగా నటించిన నయనతార చేత మళ్ళీ ఆ పవిత్రమైన పాత్ర చేయించాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. మరి ఈ మూవీలో నటించేందుకు నయన్ అంగీకరిస్తుందా. ఎందుకంటే మూడు భాగాలుగా వచ్చే ఈ మూవీ కోసం బల్క్ గా కాల్షీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నయన్ ఒకే అంటే మళ్ళీ సీతను మరి తెర మీద చూసేయొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: