సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. వరుసగా రెండు సూపర్ డూపర్ హిట్లు అందుకున్న మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో కచ్చితంగా సినిమా ఉందని ఎనౌన్స్ చేశారు.


ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించి..అదిరిపోయే హిట్ అందుకున్నాడు. దీంతో సినిమా సక్సెస్ సంబరాలలో ఉన్న సందీప్ రెడ్డి వంగా..ఇటీవల మీడియాతో మాట్లాడుతూ గతంలో మహేష్ బాబు కి ఒక లైన్ వినిపించాను అది అదిరిపోయిందని బాగా నచ్చింది అని చెప్పాడు.


దీంతో ఆ కాన్సెప్ట్ కి సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ పనులు ఎండ్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతూ త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. అయితే అప్పట్లో ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో సినిమా పూర్తిగా మాస్ సినిమానే అని సినిమాలో మహేష్ బాబు మెకానిక్ అని అదిరిపోయే స్టోరీ అని వార్తలు రావడం జరిగాయి. తర్వాత సినిమా గురించి ఎక్కడా వార్తలు రాలేదు..ఇటువంటి నేపథ్యంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా మహేష్ తో గతంలో చెప్పిన స్టోరీ తోనే సినిమా ఉందని తెలపడంతో మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: