సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా సక్సెస్ అందుకోగా ఆ తర్వాత ఆ సక్సెస్ మేనియా కొనసాగించేందుకు అనీల్ రావిపుడితో సినిమా చేస్తున్నాడు. స్రిలేరు నీకెవ్వరు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే మొదలైంది. ఈ మూవీని దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.


2020 సంక్రాంతి టార్గెట్ తో ఈ సినిమా వస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడన్న ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. అసలైతే త్రివిక్రం తో సినిమా చేయాల్సి ఉందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగతో కూడా మహేష్ సినిమా ఉందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి తరహా పాత్రలో మహేష్ ను ఊహించుకుంటే ఎలా ఉంటుంది.. అబ్బో క్రేజీ అని చెప్పొచ్చు కదా.


అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ తో సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ వంగ తన తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు. ఆల్రెడీ మహేష్ కు ఓ లైన్ వినిపించడం అది ఓకే చెప్పడం అంతా జరిగిందట. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి మహేష్ ను కలిసే ఆలోచనలో ఉన్నాడు సందీప్ వంగ.


సందీప్ లాంటి టాలెంటెడ్ డైరక్టర్ తో సినిమా అది కూడా సూపర్ స్టార్ మహేష్ అంటే ఆ సినిమా రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. అర్జున్ రెడ్డి క్యారక్టరైజేషన్ తో సినిమా హిట్ కొట్టిన సందీప్ మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో సూపర్ స్టార్ ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. మరి ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: