అక్కినేని నాగార్జున హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న కొత్త సినిమా మన్మధుడు 2. యువ నటుడు మరియు దర్శకుడైన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలున్నాయి. 2002లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. మళ్ళి ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుండడంతో దర్శకుడు రాహుల్ ఏ విధంగా ఈ సినిమా తీసుంటాడో చూడాలని అందరిలోనూ ఒకటే ఆసక్తి ఉంది. ఇక ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ సినిమాని ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది. 

అయితే ఈ సినిమా విడుదల తరువాత ఖచ్చింతగా ఒక వారానికి అంటే ఆగష్టు 15న ప్రభాస్ నటించిన సాహో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే ఇప్పుడు మన్మధుడు టీమ్ కి కొంత కలవరపెడుతున్న సమస్యగా మారిందట. వాస్తవానికి తమ సినిమా మీద యూనిట్ మొత్తానికి చాలా నమ్మకం ఉందని, అయితే తాము అనుకున్నట్లుగా సినిమా ఎంత మంచి సక్సెస్ సాధించినప్పటికీ, వారం రోజుల తరువాత సాహో వస్తుండడంతో ఎక్కువగా మాస్ మరియు యువత దృష్టి ఆ సినిమాపైనే ఉంటుందని, అంతేకాక ఆ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయబోతుండడంతో తమ సినిమాకు కొంత థియేటర్ల సమస్య కూడా తలెత్తే అవకాశం లేకపోలేదని కొంత భయపడుతున్నారట. ఇక తమ సినిమా విషయమై భారం మొత్తం అక్కినేని నాగార్జున మీదనే వేయడం జరిగిందని, 

నిజానికి నాగ్ కు యూత్ మరియు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయనే ఈ సినిమాని రక్షించాలని కోరుకుంటున్నారట. ఇక మరోవైపు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, ఏదైనా సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉంటె, ప్రేక్షకులు అది ఎవరి సినిమా అనేది చూడకుండా థియేటర్లకు క్యూ కట్టడం ఇప్పటికే అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి మన్మధుడు 2 మంచి సక్సెస్ అయితే ఆ సినిమా కలెక్షన్లను ఎవ్వరూ ఆపలేరని అంటున్నారు. మరి ఈ సినిమా విషయంలో ఏమి జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: