ఇటీవల తెలుగు భాషలో రూపొందిన బాహుబలి రెండు భాగాలూ కేవలం తెలుగులోనే కాక దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ ని సొంత చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అదే తరహాలో కన్నడ హీరో యాష్ ప్రధాన పాత్రలో నటించిన కెజిఎఫ్ సినిమా కూడా దేశవ్యాప్తంగా పలు భాషల్లో మంచి సక్సెస్ సాధించింది. ఇక ఈ ఒక్క సినిమాతో అందరి దృష్టి ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పై పడింది. మొదట్లో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూసిన దర్శకధీరుడు రాజమౌళి, సినిమాలో పాన్ ఇండియా అపీల్ ఉందని భావించి, సినిమాను దేశవ్యాప్తంగా ఇతర భాషల్లో కూడా విడుదల చేయమని చెప్పం జరిగిందట. 

అంతేకాక, అయన సినిమా చూసిన సమయంలో హీరోని మరియు కథను ఇంతలా ప్రేక్షకుడికి చేరువయ్యేట్లు ప్రశాంత్ ఇంత అద్భుతంగా ఎలా తీయగలిగారా అని రాజమౌళి ఆశ్చర్యపోయారట. ఇక మొదటి చాప్టర్ విజయం తరువాత, ప్రస్తుతం రెండవ చాప్టర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ కెజిఎఫ్ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ మన తెలుగు హీరోలు మహేష్ లేదా ఎన్టీఆర్ లలో ఒకరితో సినిమా చేసే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం వార్తలు రావడం జరిగింది. అయితే ఈ విషయమై నేడు ఒక వార్త కొన్ని టాలీవుడ్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ప్రశాంత్ నీల్ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని రహస్యంగా కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని, అది విన్న ఎన్టీఆర్, దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకురండి, 

వీలైనంత త్వరగా సినిమా మొదలుపెడదాం అని చెప్పడం జరిగిందని అన్నట్లు చెప్తున్నారు. నిజానికి ప్రశాంత్ తొలుత మహేష్ హీరోగా ఒక సినిమా రూపొందిస్తారని అందరూ అనుకున్నారు, అయితే ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలను బట్టి చూస్తే ఆయన ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అయితే దీనిపై ఎక్కడా కూడా ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త నిజం అయితే బాగుండు, అని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: