ఏ ముహూర్తాన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ను డైరెక్టర్ సందీప్ రెడ్డి చేశాడో ఆ సినిమాలో నటించిన నటీనటులు కెరీర్లు తారాస్థాయికి చేరి పోయాయి. హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మతిపోయే విధంగా రాణిస్తుంటే..మరోపక్క హీరోయిన్ షాలిని పాండే కూడా బాగానే అవకాశాలు అందుకుంటోంది. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి విషయానికొస్తే ఇదే సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.


దీంతో సందీప్ రెడ్డి పనితనం చూసిన చాలా మంది స్టార్ హీరోలు...సందీప్ రెడ్డి తో చేయడానికి ఇప్పటికే క్యూ కడుతున్నటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. 'కబీర్ సింగ్' పేరుతో వచ్చిన అర్జున్ రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే 300 కోట్లకు పైగా కలెక్షన్ల సాధిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.


దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా ప్రొడ్యూసర్లు సందీప్ రెడ్డి తో సినిమాలు చేయటానికి క్యూలు కాడుతున్నారట. మరి కొంత మంది నిర్మాతలు అయితే వంద కోట్ల రేంజ్ లో ప్యాకేజ్ లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా సందీప్ రెడ్డి వంగా కి ఇటీవల స్టోరీ చెప్పమన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం సందీప్ రెడ్డి మాత్రం బాలీవుడ్ వీడే ఛాన్స్ లేదని అర్థమవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: