సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న దొరసాని, అలాగే మరోపక్క  రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంష్ హీరోగా వస్తోన్న రాజ్ దూత్  రేపు  విడుదలకానున్నాయి. ఈ రెండు చిత్రాలు రెండు వైవిధ్యమైన జోనర్లలో తెరకెక్కినప్పటికీ  ఈ ఇద్దరు యంగ్ హీరోలలో ఎవరు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం నమోదు చేస్తారో చూడాలి.  


అయితే రొమాంటిక్ కామెడీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న "రాజ్ దూత్" పై  పెద్దగా అంచనాలు లేవు. ఇక ఈ సినిమాలో మేఘాంష్ సరసన హీరోయిన్ గా నక్షత్ర నటిస్తుండగా, లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్నారు. శ్రీహరి కుమారుడు కావడంతో  చాలామంది స్టార్స్ సపోర్ట్ చేస్తూ సినిమా గురించి బాగా ప్రమోట్ చేస్తున్నారు. 


 అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న "దొరసాని" పై కూడా భారీ బజ్ ఏమి లేదు.  డైరెక్టర్ మహేంద్ర తెలంగాణాలో దొరల కాలం నాటి ప్రేమకథను హృద్యంగా తెరకెక్కించాడని సమాచారం. హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ మూవీతో నటిగా పరిచయమవుతుంది. మధుర శ్రీధర్ రెడ్డి,యాష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఇంతకీ  ఒకేరోజు వస్తోన్న  వారసుల  ఎవరు సక్సెస్ అవుతారో ? 


మరింత సమాచారం తెలుసుకోండి: