ఈ మద్య టాలీవుడ్ లో కొత్త హీరోలు, హీరోయిన్లు తమ టాలెంట్ నిరూపించుకోవడాని తెగ కష్టపడుతున్నారు.  ఇక వారసుల విషయానికి వస్తే ఇది కాస్త ఎక్కువే.  ఒకప్పుటు లాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ మాన్ గా పేరు తెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్-జీవిత కూతురు శివాత్మిక హీరోయిన్ గా, యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ జంటగా వస్తున్న ‘దొరసాని’మూవీ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇటీవల రీసెంట్ గా ప్రివ్యూ షోని ప్రదర్శించిన చిత్ర యూనిట్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

సినిమా హార్ట్ టచింగ్ గా ఉందంటూ బెస్ట్ లవ్ స్టోరీ అని కామెంట్ చేశారు.  టాలీవుడ్ లో పలువురు యువ దర్శకులతో పాటు కొంత మంది సినీ నటులు కూడా దొరసాని స్పెషల్ షోని వీక్షించారు.  ఈ మూవీ 1980 కాలం నాటి తెలంగాణ దొరలు గడీల పాలన చేస్తున్న సమయంలో ఓ యువకుడు గడిలో ఉండే చిన్న దొరసానిని చూసి ప్రేమిస్తాడు. 

ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి అతనిపై హత్యాయత్నం చేయించి అది కుదరక కొన్ని సంవత్సాల పాటు ఎవరికీ తెలియకుండా జైలులో మగ్గేలా చేస్తాడని..జైలు నుంచి తిరిగి వచ్చిన ఆ యువకుడు చిన దొరసాని ప్రేమ పొందుతాడా? లేదా అన్నది వెండి తెరపై చూడాల్సిందే.  ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ హార్ట్ ని టచ్ చేస్తాయని చెబుతున్నారు.

ఒక నిజాయితీగల ప్రేమకు ప్రతిరూపమే దొరసాని అని ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా అని వారి వివరణ ఇస్తున్నారు.  ఈ మూవీ ఆనంద్ దేవరకొండ - శివాత్మిక రాజశేఖర్ కొత్తే అయినా మంచి నటనతో మెప్పించారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ ఎంత వరకు హిట్ అవుతుంది..కలెక్షన్ ఏ రేంజ్ లో వస్తాయన్న విషయంపై ఈ ఇద్దరు నటుల భవిష్యత్ ఆదారపడి ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: