పదిహేనేళ్ల క్రితం తన అందచందాలతో, సెక్సీ లుక్స్ తో హిందీ ప్రేక్షకుల్లో గుబులు రేపింది మల్లికా శరావత్. ఇప్పటికీ తన నాజూకు అందాలను, సెక్సీ లుక్స్ కాపాడుకుంటోంది. పలు అంతర్జాతీయ సినిమాల్లో నటిస్తూనే ఉంది. 2005లో జాకీచాన్ తో కలిసి “ది మైత్” అనే సినిమాలో నటించి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. భారత్ లో షూటింగ్ జరుపుకున్న జాకీచాన్ మూవీ కూడా అదే.

2016లో విడుదలైన టైమ్ రైడర్స్ మూవీలో తన గెటప్ కు సంబంధించి ఓ లుక్ ను తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఆమెను చూసిన వారెవరైనా వావ్.. మల్లికా అనాల్సిందే. టు పీస్ బికినీ లాంటి గెటప్ లో చాలా సెక్సీగా ఇచ్చిన స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. “టైమ్ రైడర్స్ మూవీలో యుధ్దానికి సన్నద్ధమవుతున్న రాణి” అంటూ ఇన్ స్టా వాల్ లో రాసుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మల్లికా గత ఏడాది కేస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యతో వార్తల్లో నిలిచింది. డైరెక్టర్స్ తెల్లవారుఝాము 3 గంటలకు రూమ్ కి పిలిచేవారని, హీరోలు కూడా.. ఆన్ స్క్రీన్ లో మాత్రమే బోల్డ్ గా ఉంటావా..” అంటూ వేధించారంటూ వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వీటిని ఖండించినందుకే తాను చాలా సినిమాలు తనకు దక్కకుండా పోయాయని కూడా తెలిపింది.

ప్రస్తుతం మల్లికా ఏఎల్టీ బాలాజీ డిజిటల్ సమర్పణలో వస్తున్న సబ్ కే ఫతేగీ అనే హర్రర్ కామెడీ లో తుషార్ కపూర్ తో కలిసి నటిస్తోంది. 2003లో క్వాహిష్ అనే మూవీతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన మల్లికా.. 2004లో వచ్చిన మర్డర్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆ సినిమాలో తన అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దేశవ్యాప్తంగా మల్లికా పేరు మోగిపోయింది. “ఆ సినిమా వల్లే నన్ను అందరూ తప్పుగా చూడటం మొదలుపెట్టారు” అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: