ఛలో, గీతా గోవిందం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది రష్మిక మందన్నా. దేవదాస్ సినిమాతో యావరేజ్ హిట్టు కొట్టిన రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా యూనిట్ తనను వేధించారని చెబుతోంది రష్మికా మందన్నా. వేధించటం అంటే సినిమాలో పాత్ర  చాలా బాగా రావడం కోసం తనను చాలా కష్టపెట్టారని చెబుతోంది రష్మికా మందన్నా. 
 
డియర్ కామ్రేడ్ సినిమాలో స్టేట్ క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతుంది రష్మిక. ఈ పాత్రలో కేవలం కొన్ని నిమిషాల పాటే క్రికెట్ ప్లేయర్ గా రష్మిక నటిస్తుంది. ఈ సినిమా కోసం మూడు నెలల కంటే ఎక్కువగా క్రికెట్ ప్రాక్టీస్ చేసిందట రష్మిక. కేవలం కొన్ని నిమిషాల కోసం తనను చాలా కష్టపెట్టారని చెబుతోంది రష్మిక. డబ్బింగ్ కూడా ఎవరికైనా మూడు నాలుగు రోజుల్లో పూర్తవుతుందని కానీ నాకు మాత్రం మూడు నెలల పాటు చెప్పించారని ఏదో ఒక సీన్లో డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే మరలా చెప్పించేవారని చెబుతోంది రష్మిక. 
 
కానీ ఈ కష్టం అంతా సినిమా బాగా రావడం కోసమే అని రష్మిక చెప్పింది. గీతా గోవిందం కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఉండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిన్న రిలీజైన డియర్ కామ్రేడ్ ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. భరత్ కమ్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జులై 26 వ తేదీన విడుదల కాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: