బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించాడు రెబల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుత రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైనా అద్భుతం జరిగిందంటే...సౌత్ కి సంబంధించిన...డైరెక్టర్ లేకపోతే సినిమా అయి ఉన్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీ కి చెందిన టెక్నీషియన్ల పై పక్షపాత ధోరణి ఇటీవల చూపిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హిట్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఇటీవల బాలీవుడ్ లో ఒక “ఏ” సర్టిఫికెట్ సినిమాతో 200 కోట్ల వసూళ్లను కొల్లగొట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో సౌత్ ఇండస్ట్రీ లో టాలీవుడ్ కాంబినేషన్ బాలీవుడ్ లో ఎక్కువై పోతుందని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు అనుకుంటున్నారో ఏమోగానీ ఇప్పుడు “సాహో”కు అడ్డంకులు తయారు చేస్తున్నారా అన్నట్టు ఇప్పుడు వార్తలు వైరల్ గా మారాయి.


సాహో సినిమా రిలీజ్ అవుతున్న రోజు అదే రోజున బాలీవుడ్ కు చెందిన మరో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో అందులోను జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్నటువంటి “బాట్లా హౌస్” కోసమే ఎక్కువ థియేటర్లను కేటాయించి సాహో కు తక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు బాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై మండిపడుతున్నారు. మొత్తం మీద బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ ఇండస్ట్రీ లో వస్తున్న కష్టం చూసి చాలామంది ప్రభాస్ కెరియర్ కి ఇది పెద్ద దేబ్బే అని అంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: