మహానటి సావిత్రి తరువాత దక్షణాది సినిమారంగాన్ని మూడు దశాబ్దాల పాటు ఏలిన వాణిశ్రీ 13 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు. లేటెస్ట్ గా ఒక టీవీ సీరియల్ లో నటించటానికి ఆమె ఓకే చెప్పడం ఒక సంచలనం.అయితే ఆ సీరియల్ కు ప్రేమ నగర్ అని పేరు పెట్టడం మరింత సంచలనంగామారింది. .
ఈ సీరియల్ లో కీలకపాత్రను పోషిస్తున్న ఆమె ఈ రోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లోఅనేక ఆసక్తికర విషయాల పై స్పందించారు. ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. మహానటి సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని భర్తీ చేసిన క్రెడిట్ తనకు దక్కింది అన్న విషయం పై స్పందిస్తూ ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది .
సావిత్రి చందమామ అయితే తామంతా తారలం మాత్రమె అని చెపుతూ సావిత్రిని సినిమా కోసమే దేవుడు సృష్టించాడుఅని అభిప్రాయ పడుతూ హావభావ ప్రదర్శనల్లో కానీ సంభాషణలు చెప్పడంలో కానీ సావిత్రితో పోల్చగల నటీమణి మళ్ళి పుడతారు అన్న నమ్మకం తనకు లేదు అంటూ చెప్పుకొచ్చింది . ఇదే సందర్భం లో సంచలనం సృట్టించిన సావిత్రి బయో పిక్ మహానటి గురించి ఆమె మాట్లాడుతూ కొన్ని సంచలన సంచలన చేసింది.
తానూ మహానటి బయో పిక్ చూశానని అయితే ఆ మూవీ చూస్తూ వుంటే తనకు నిద్ర వచ్చి పడుకున్న విషయం తెలియ చేసింది.అంతే కాదు మహా నటి బయో పిక్ లో తనకు ఎక్కడా సావిత్రి కనిపించ లేదు అంటూ ఆ మూవీ తనకు నచ్చ లేదు అన్న సంకేతాలు ఇచ్చింది .కుటుంబ సినిమాలకు మహా రాణిలా ఒక వెలుగు వెలిగిన వాణిశ్రీ బుల్లితెర ఎంట్రీ ఎంతవరకుసక్సెస్స్అవుతుందోచూడాలి. .