దాదాపు 9 ఏళ్లుగా హీరోగా ఇండస్ట్రీలో ఉన్న సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ల కన్నా ఫ్లాపులే ఎక్కువని చెప్పొచ్చు. తను చేసిన ప్రతి సినిమాకు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టే సందీప్ కెరియర్ లో బాగా వెనుక పడ్డాడు. ఇక లేటెస్ట్ గా తను హీరోగా అతనే నిర్మించిన సినిమా నిను వీడని నీడను నేనే. 


కార్తిక్ రాజు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ కొత్తగా ఉంది. కథనంలో కొన్ని మిస్ లీడింగ్స్ జరిగాయని తెలుస్తుంది. ఇదిలాఉంటే హీరోగా సందీప్ పని అయిపోయిందని ఓ నిర్మాత అన్నట్టుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చెప్పి బాధపడ్డాడు సందీప్ కిషన్. అందుకే ఈ సినిమాకు నిర్మాతగా మారి కసి తీర్చుకోవాలని చూశాడు.


రిలీజ్ కు రెండు రోజుల ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఈ సినిమా పక్కా హిట్టు కొడుతున్నాం.. తన కెరియర్ లో ఇదే బెస్ట్ సక్సెస్ మూవీ అంటూ పెద్ద హామీలే ఇచ్చాడు సందీప్ కిషన్. అఫ్కోర్స్ తను గొప్ప సినిమా తీసుండొచ్చు కాని ప్రేక్షకులకు అలా చెబితే సినిమాపై అంచనాలు పెరుగుతాయి. ఒకవేళ సినిమా బాగున్నా వారి అంచనాలను అందుకోకపోతే మళ్లీ దెబ్బపడుతుంది.    


మొత్తానికి సందీప్ కాన్ఫిడెన్స్ కు నిను వీడని నీడను నేనే సినిమా అగ్ని పరీక్షగా మారిందని చెప్పొచ్చు. యువ హీరోల్లో ప్రతిభ కలిగిన సందీప్ సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే ప్రయత్నిస్తూ పోతే కచ్చితంగా ఏదో ఒక టైంలో లక్ కలిసి రాక మానదు. అది నిను వీడని నీడను నేనే తోనే ఆ లక్ ఫ్యాక్టర్ కలిసి రావాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: