గత ఏడాది తెలుగు ఇండస్ట్రీలో సంచల రికార్డులు సృష్టించిన చిత్రం ‘రంగస్థలం’.  ప్రముఖ దర్శకులు సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత నటించిన ‘రంగస్థలం’సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ చిత్రంలో రాంచరణ్ చెవిటివాడి పాత్రలో నటించి అద్భుతం సృష్టించారు.  ఇక పల్లెటూరి అమ్మాయి పాత్రలో సమంత దుమ్మురేపింది.

దేవీశ్రీ అందించిన పాటలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి.  బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది ‘రంగస్థలం’. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఆ దిశగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ప్రయత్నాలు ప్రారంభించాడు. 

తాజాగా రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం కన్నడ డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కర్ణాటక వ్యాప్తంగా 85 స్క్రీన్స్ లో విడుదలవుతుండడం విశేషం. మాయాబజార్ తర్వాత కన్నడలో డబ్ అయి విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం రంగస్థలమే. కన్నడలో రాంచరణ్ అదృష్టం ఎలా ఉందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: