తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది.  ఒకప్పుడు పల్లెటూరి బుల్లోడిగా..తర్వతా ఫ్యాక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఇటీవల తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీశారు.  ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాకున్నా బాలయ్య నటనకు వంద మార్కులు పడ్డాయి.  ఇటీవల ఏపిలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో చిత్రాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.

తెలుగు ప్రేక్షకులు ఇప్పటిదాకా చూసిన క్రేజీ కాంబినేషన్ ల లో పూరి జగన్నాధ్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ కూడా ఒకటి.  వీరిద్దరి కాంబిషన్ లో వచ్చిన ‘పైసా వసూల్’ ఎన్నో అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్తగా కనిపించాడు..పూర్తి మాస్ లుక్.  సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి.  వాస్తవానికి  ‘పైసా వసూల్’ చిత్రం విడుదలకు ముందే బాలకృష్ణ పూరి తో మరొక  చిత్రం తీస్తానని హామీ ఇచ్చాడట.

అయితే బాలకృష్ణ ఈ చిత్రం ఒప్పుకునే ముందు ఒక కండీషన్ పెట్టాడట…. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం హిట్టయితే అప్పుడే పూరి జగన్నాథ్ తో బాలకృష్ణ సినిమా చేస్తాడట. మరోవైపు ఇస్మార్ట్ శంకర్ మూవీపై అటు చార్మి, రామ్, పూరిలు కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: