రష్మిక మందన్న చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కన్నడ కస్తూరి అయిన రష్మిక ప్రస్తుతం మహేష్ బాబు - అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తనకు కలిసి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ సరసన డియ‌ర్ కామ్రేడ్‌ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన‌ను ఎంత ఇబ్బంది పెట్టారో రష్మిక పూసగుచ్చినట్టు వివరించింది. తనను బాగా టీజ్ చేశారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. వేధింపులు అంటే సీరియస్‌గా కాదండోయ్ ... సినిమాలో కొన్ని సీన్లు షూటింగుకు సంబంధించి ఆమెను బాగా ఇబ్బంది పెట్టారట.


పదినిమిషాల క్రికెట్ కు సంబంధించి ఆమెతో ఏకంగా నాలుగు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయించారట. ఈ ప్రాక్టీస్ లో తనకు చాలా దెబ్బలు తగిలాయి అని కూడా చెప్పింది. షూటింగ్ అయిపోతుంద‌నుకుంటున్న‌ టైంలో లొకేషన్ లో ఇరవై రోజుల పాటు ఆమెను అందరు చాలా ఏడిపించేశారట. డియ‌ర్‌ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని బయట పెట్టింది. ఇదంతా ఏదో సీరియస్ గా చెప్పడం లేదని ఇష్టంతోనే చెబుతున్నాను అని చెప్పింది.


చివరకు డ‌బ్బింగ్ టైంలో కూడా తనను చాలా ఇబ్బంది పెట్టారని... నాలుగు నెలల పాటు డబ్బింగ్ చెప్పించారు... మొన్న కూడా ఓ సీన్‌కు డ‌బ్బింగ్ చెప్ప‌మ‌న్నార‌ని న‌వ్వుతూ చెప్పింది. తనను ఇంత‌ ఇబ్బంది పెట్టినా సినిమాను చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది. రష్మిక ఇక ఇప్పటికే విజయ్ గీతగోవిందం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న డియ‌ర్ కామ్రేడ్ థియేటర్లలోకి వస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: