అక్కినేని కుటుంబంలో మరో కొత్త బ్యానర్ రాబోతుందా ? తన భార్య సమంత కోసం నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య కొత్త బ్యాన‌ర్‌ పెట్టబోతున్నాడా ? అంటే ఇండస్ట్రీ సర్కిల్స్ లో అవుననే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అక్కినేని కుటుంబంలో ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ - మనం ఎంటర్ప్రైజెస్ - శ్రీ నాగ్ కార్పొరేషన్ అంటూ మూడు బ్యాన‌ర్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నాగచైతన్య ఆధ్వ‌ర్యంలో నాలుగో బ్యానర్ రెడీ అవుతోందట.


నాగచైతన్య - సమంత కలిసి ఈ కొత్త బ్యానర్ ను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. తాత స్థాపించిన‌ అన్నపూర్ణ బ్యానర్ లోనే సినిమాలు చేశాడు. పెళ్లి అయ్యాక కూడా భార్య స‌మంత క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి నటించిన మ‌జిలీ సినిమాతో పాటు తాజాగా సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే సమంత కథానాయిక ప్రాధాన్యం ఉన్న మంచి కథాబలం ఉన్న స్టోరీల‌తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతోందట.


మ‌రోసారి నందిని సొంత క‌థ‌తో తెర‌కెక్కించే సినిమాలో స‌మంత చేస్తోంద‌ట‌. ఈ సినిమాను చైతు - స‌మంత త‌మ సొంత బ్యాన‌ర్‌లోనే నిర్మించాల‌ని చూస్తున్నార‌ట‌. కెరీర్లో ఇంతకుముందు రొటీన్ గ్లామర్ క్యారెక్టర్లే ఎక్కువగా చేసిన సామ్.. ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో సాగిపోతోంది. ఇందులో చైతూ సపోర్ట్ కీలకం. ఆమెకు మరింత మద్దతు ఇస్తూ ఇప్పుడు సినిమా నిర్మించడానికే చైతూ ముందుకు రావడం విశేషమే. అయితే త‌న ఇంట్లో మూడు సొంత బ్యాన‌ర్లు ఉన్నా కాద‌ని.. ఇప్పుడు సొంత బ్యాన‌ర్ పెట్ట‌డం మాత్రం నాగ్‌కు షాకే.



మరింత సమాచారం తెలుసుకోండి: