జూనియర్ ఎన్టీయార్ సినిమాల సెలెక్షన్లో ఎపుడూ రైట్ డెసిషన్ తీసుకుంటాడని అంతా అంటారు. మంచి జడ్జిమెంట్ ఎన్టీయార్  చేయగలరని అంటారు. తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్ ని చూసి జూనియర్ అందులో సరకు చెప్పేస్తాడు. అలాగే కొత్త డైరెక్టర్ల టాలెంట్ కూడా ఆయన బాగానే అంచనా వేస్తారు.


ఇదిలా ఉండగా, ప్ర‌స్తుతం ఆర్‌ఆర్‌ఆర్ తో బిజి బిజీగా ఉన్న జూనియర్ ఎన్‌టిఆర్  ఈ సినిమా త‌దుప‌రి కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.  ఎన్.టి.ఆర్ త‌గిన స‌మ‌యంలో  మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ ఫిలింన‌గ‌ర్ లో విశ్లేష‌కులు చెపుతున్నారు.  ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తరువాత  తదుపరి చిత్రం మ‌రింత భారీగా ఉండేలా చూసుకుంటున్నాడ‌ని, వాణిజ్యపరంగా  ప్రశాంత్  ద‌ర్శ‌క‌త్వం కూడా స‌హ‌క‌రించే ఆస్కారం ఉంద‌న్న‌ది వారి మాట‌. 


ఈ చిత్రాన్ని నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ సభ్యులలో ఒకరు చెపుతున్న దాని ప్ర‌కారం కెజిఎఫ్ లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన  ప్రశాంత్ తో క‌ల‌సిప‌నిచేసేందుకు  తారక్ అడిగిన వెంట‌నే అంగీక‌రించార‌ని, ప్ర‌స్తుతం తారక్ , ప్రశాంత్ ఇద్దరూ క‌థాంశంపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని, ఇవి పూర్త‌య్యాక పోడ‌క్ష‌న్‌దిశ‌గా అడుగులు వేయ‌నున్న‌ట్టు చెప్పారు.  ప్రస్తుత కట్టుబాట్లతో బిజీగా ఉన్నారు మరియు అదే పూర్తి చేసిన తర్వాత వారి సహకారంపై దృష్టి పెట్టనున్నారు.
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: