ఇటీవల కాలంలో మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. నమ్మించి మోసం చేయడంలో దిట్ట అవుతున్నారు జనాలు. సెలెబ్రిటీలు కూడా ఇలా మోసపోతూనే ఉన్నారు. ఈ లిస్ట్ లో సోనాక్షి సిన్హా కూడా చేరిపోయింది. అదెలా ఉంటె, ఓ షోలో డ్యాన్స్ చేస్తానని ఒప్పుకొన్న సోనాక్షి పారితోషికంగా రూ.24 లక్షలు అడిగారట.
ఇందుకు సదరు మేనేజర్ కూడా ఒప్పుకొన్నారు. అయితే డబ్బు తీసుకున్నాక సోనాక్షి దిల్లీకి రాలేదని ఆరోపిస్తూ మొరాదాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో మొరాదాబాద్ పోలీసులు ముంబయిలోని జుహు పోలీసులను కేసు నిమిత్తం ఆశ్రయించారు.
పోలీసులు ఆమెను విచారించేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారట. ఈ విషయం తెలుసుకున్న సోనాక్షి సిన్హా ట్విట్టర్ ద్వారా ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ఆ రోజు జరిగిన విషయాల గురించి చెపింది.
ఓ ఈవెంట్ ఆర్గనైజర్ తన పనిని సరిగ్గా నిర్వర్తించకపోగా.. నన్ను ఈ కేసులో ఇరికించి సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. కానీ అతనికేం తెలుసు మీడియా వర్గాల్లో నాపై ఇప్పటివరకు ఎలాంటి మచ్చ లేదని. నా టీం నాకు సహకరిస్తోంది. విచారణ జరుగుతోంది.
కాబట్టి ఇలాంటి మూర్ఖుల మాటలను నమ్మొద్దని మీడియా వర్గాలను కోరుకుంటున్నాను.. అని చెప్పి పోస్ట్ చేసింది. ఇందులో తప్పు ఎవరిది.. ఈవెంట్ మేనేజర్ దా లేదంటే... సోనాక్షిదా అన్నది తెలియాలి.