రామ్ చరణ్ ఇప్పటి వరకు సోషల్ మీడియా అకౌంట్ ను మైంటైన్ చేసింది లేదు. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాను అకౌంట్ ను ఓపెన్ చేశారు. మొన్నటికి మొన్న ఇన్ స్టాగ్రమ్ లో ప్రవేశించిన చరణ్ తాజాగా ట్విట్టర్ లో కి ఆరంగేట్రం చేయడంపై అభిమానుల్లో చర్చకొచ్చింది. ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రమ్ .. ట్విట్టర్ ద్వారా ఇకపై చరణ్ వ్యక్తిగత- వృత్తిగత సమాచారం అభిమానులకు చేరనుంది. ముఖ్యంగా సినిమాల ప్రమోషన్స్ కి ఈ వేదికల్ని చరణ్ ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది.


ఇటీవలే `ఆల్వేస్ రామ్ చరణ్` పేరుతో ఇన్ స్టాగ్రమ్ లో ప్రవేశించిన చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ స్టిల్ ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ ఇన్ స్టాలో లైక్ లు కొడుతూ చరణ్ ని అనుసరించారు.  ఈ మాధ్యమంలో ఇప్పటికే 4.70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ గా ట్విట్టర్ లోనూ చరణ్ ని ఫాలో చేసేందుకు అభిమానులు ఆసక్తిని కనబరిచారు.


ఇలా ట్విట్టర్ లో చేరి తొలి పోస్టుగా తన మాతృమూర్తి సురేఖ గారితో కలిసి ఉన్న ఫోటోని చరణ్ షేర్ చేశారు. తన తల్లిగారితో ఉన్న ప్రేమానుబంధాన్ని ఆ ఫోటో రివీల్ చేసింది. ఈ ఫోటోకి ఇప్పటికే 2.10 లక్షల మంది లైక్స్ కొట్టారు. ఇకపై సోషల్ మీడియా ద్వారా సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోల్ని.. ఫోటోల్ని చరణ్ ఇక్కడ షేర్ చేయనున్నారట. ప్రత్యేకంగా సైరా ప్రమోషన్ ను పరుగులు పెట్టించడానికే ఈ విధముగా అకౌంట్స్ ఓపెన్ చేశారని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: