పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికి తెలుసు. అంతకు ముందు ఓ మోడల్. బద్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత అధికారికంగా ఇద్దరు విడిపోయారు.
విడిపోయిన తరువాత రేణు దేశాయ్ సీనియాలు తీస్తూ, టీవీ షోలు చేస్తున్నది. తన పిల్లలకు అండగా ఉంటున్న రేణు దేశాయ్ గురించి కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అది నిజమే అనుకున్నా.. మారాలా ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి వార్తలు రాలేదు.
ఇప్పుడు రేణు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ తెలుగు సినిమాలో రేణు నటించబోతున్నట్టు సమాచారం. దీనిపై మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా క్లారిటీ ఇచ్చాడు. టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కి మాటలు రాస్తున్న సాయి మాధవ్ ఆ సినిమాపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలో రేణు దేశాయ్ ని ఒక పాత్ర కోసం అనుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
త్వరలోనే ఆ విషయమై అఫీషియల్ ప్రకటన విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావ్ జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. ఈ బయోపిక్ లో బెల్లకొండ శ్రీనివాస్ మెయిన్ లీడ్లో నటిస్తున్నాడు ఈ చిత్రాన్ని ‘దొంగాట’ ఫెేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ స్టేట్మెంట్ ద్వారా రేణు దేశాయ్ సినిమాల్లోకి మళ్ళీ తిరిగొచ్చినట్లే అనే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పవచ్చు. క్లారిటీ సరే.. ఆమె ఏ సినిమాలో చేస్తున్నది. హీరో ఎవరు అన్నది తెలియాలి.