భారతదేశ అతిలోక సుందరి శ్రీదేవి మరణం పట్ల యావత్ దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా శ్రీదేవి భర్త ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి మరణం తనకి తీరని లోటని...తీవ్ర నిరాశకు దుఃఖానికి గురయ్యారు. అయితే శ్రీదేవి మరణించి చాలా కాలం అవుతున్న ఆమె మరణంపై ఇప్పటికీ అందరికీ అనుమానాలు ఉన్నాయి. బాత్రూం లో కాలుజారి పడిపోయి తలకు దెబ్బతగిలి చనిపోయిందని అప్పట్లో వార్తలు రాగా..తాజాగా ఇటీవల ఆమె మరణానికి సంబంధించి భర్త బోనీకపూర్ చాలా రోజుల తర్వాత నోరువిప్పి శ్రీదేవిది ముమ్మాటికీ హత్యే అన్నట్టుగా వ్యాఖ్యానించారు.


ఇటువంటి క్రమంలో ఇటీవల ఓ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ...శ్రీదేవి మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్ తనతో పంచుకున్నారని చెప్పాడు. ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా.. అడుగు లోతు ఉండే బాత్ టబ్ లో పడి చనిపోవడం జరగదని.. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తి పట్టి.. తలను నీటిలో ముంచి ఉంటారని.. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే ఛాన్స్ లేదని అన్నారు.


శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోయి ఉండకపోవచ్చని, హత్య అయి ఉండవచ్చని డాక్టర్ ఉమాదత్తన్ తనతో అన్నట్లు బోనీ కపూర్ ఆ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వ్యాసంలో తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: