ఈ మాట అంటుంది ఎవరో కాదు అర్జున్ రెడ్డి.  తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.  పెళ్లిచూపులు చిత్రంతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా చిత్రాలతో వరుస విజయాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగారు. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ‘డీయర్ కామ్రెడ్’చిత్రంతో రిలీజ్ కి ఉంది. ఇక తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటించిన ‘దొరసాని’ చిత్రం నిన్న రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.   ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ పాత్రపై ప్రశంసల జల్లులు కురిపించారు సెలబ్రెటీలు.  తాజాగా రాజుగా ఆనంద్‌, దొర‌సానిగా శివాత్మిక అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచార‌ని అంటున్నారు. అయితే ఈ చిత్ర స‌క్సెస్‌పై విజ‌య్ దేవ‌రకొండ త‌న ట్విట్ట‌ర్ ద్వార స్పందించాడు. 

మిమ్ముల్ని చూసి గర్వపడుతున్నాను..బ్యాగ్ గ్రౌండ్ ఇమేజ్ తో కాకుండా మీ కష్టాన్ని నమ్ముకున్నారు. ఈ మూవీలో ప్ర‌తి ఒక్క‌రు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చారు. ఈ కారంగా సినిమా చూడ‌టానికి అద్భుతంగా ఉంది. కె.వి.ఆర్.మహేంద్ర, ప్రశాంత్ విహారి, సన్నీ కూరపాటి మీరు నిజంగా సూపర్. త్వరలోనే మన దారులు కలుస్తాయని అనుకుంటున్నారు. సినీ లవర్స్ ని ఈ సినిమా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్'' అంటూత‌న ట్వీట్‌లో తెలిపాడు విజ‌య్.

మరింత సమాచారం తెలుసుకోండి: