తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 ముగిశాయి.  బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించారు.  మొదటి షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.  ఇక రెండో సీజన్ కి నానీ హూస్ట్ గా వ్యవహరించారు. అయితే ఇంటి సభ్యుల మద్య ప్రతిరోజూ ఏదో ఒక రగడ..బయట కౌశల్ ఆర్మీ, ఇతర కంటెస్టెంట్లకు సంబంధించిన అభిమాన సంఘాలు ఇలా రచ్చ రచ్చ అయ్యాయి. 

తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  బిగ్ బాస్ సీజన్ 3 కి అక్కినేని నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ తెలుగు యాంకర్ శ్వేతారెడ్డి బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.

బిగ్ బాస్-3ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇటీవల తనను బిగ్ బాస్ లోకి ఆహ్వానించారని..ఎంపిక చేశారని.. ఇప్పటివరకు అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు.  ఈ మేరకు శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు బిగ్ బాస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. ఇటీవలే శ్వేతారెడ్డి ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ ను వేశ్యాగృహంతో పోల్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: