టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గతంలో ఓసారి రామాయణం మెగా ప్రాజెక్టును భారీ స్థాయిలో టేకప్ చేస్తానని చెప్పారు. తాజాగా ఆయన రామాయణం ప్రాజెక్టు గురించి వెల్లడించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ సినిమాపై పడింది. 1500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమాకు దంగల్ ఫేమ్ నితీష్ తివారి దర్శకుడిగా సెలెక్ట్ అయ్యాడంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో బాగా హల్ చల్ చేస్తోంది.
ఈ సినిమాలో ముందుగా రాముడుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నట్టు టాక్ వినిపించింది. లేటెస్ట్ టాక్ ప్రకారం చరణ్ ఈ ప్రాజెక్టు పట్ల అంత ఆసక్తిగా లేడు అంటున్నారు. మరి కీలకమైన రాముడు రోల్కు ఇప్పుడు ఎవరు ? అయితే సెట్ అవుతాడు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రాముడు పాత్ర యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కరెక్ట్ గా సూట్ అవుతుందని సోషల్ మీడియాలో చాలా మంది హీరోల అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరం యంగ్ స్టార్ హీరోలలో పౌరాణిక చిత్రాలకు సూట్ అయ్యే క్వాలిటీస్ ఎన్టీఆర్ లోనే ఎక్కువ ఉన్నాయని కూడా వారు చెపుతున్నారు. యాక్టింగ్.. డైలాగ్ డిక్షన్.. ఫేస్ ఫీచర్స్ ఇలా ప్రతి దాంట్లోనూ ఎన్టీఆర్ కరెక్టుగా సూట్ అవుతాడు. ఈ తరం స్టార్ హీరోలలో పౌరాణికపాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన హీరో ఎన్టీఆర్ ఒక్కరే. బాలల రామాయణంలో రాముడిగా... యమదొంగలో కుర్ర యముడిగా... జైలవకుశలో రావణ పాత్రలో మెరిసి అందరినీ మెప్పించారు. ఇలా రాముడు.. రావణుడు.. యముడు అన్ని పాత్రలు ఎన్టీఆర్ సూపర్బ్గా చేశాడు. దీంతో ఇప్పుడు అల్లు వారి రామాయణంలో ఎన్టీఆర్కు రాముడి క్యారెక్టర్ ఇవ్వాలని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో ? చూడాలి.