టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజుకు రామానాయుడిలా  ఎప్పటినుండో ఇత‌ర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాల‌నే కోరిక ఉంది. ఆ క్రమంలోనే   మొదట శంక‌ర్‌ క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో భార‌తీయుడు-2ను ప్లాన్ చేసినా.. అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు తన నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'ఎవడు'  చిత్రాన్ని   ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత నిఖిల్ అద్వానీతో క‌లిసి హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడు  దిల్ రాజు.  


హేట్ స్టోరీ 4 దర్శకుడు మిలాప్ జావేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట.  బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత ద్వయం ఇటీవల ఎవడు చిత్రాన్ని  చూసారని.. ఈ చిత్రం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగట్లు స్క్రిప్ట్ లో  కొన్ని మార్పులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో  అల్లు అర్జున్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మరి హిందీలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజుకు రామానాయుడిలా  ఎప్పటినుండో ఇత‌ర భాషల్లో కూడా సినిమాలు నిర్మించాల‌నే కోరిక ఉంది. ఆ క్రమంలోనే   మొదట శంక‌ర్‌ - క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో భార‌తీయుడు-2ను ప్లాన్ చేసినా.. అది సెట్ అవ్వలేదు. ఇప్పుడు తన నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'ఎవడు'  చిత్రాన్ని   ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత నిఖిల్ అద్వానీతో క‌లిసి హిందీలోకి రీమేక్ చేయబోతున్నాడు  దిల్ రాజు


హేట్ స్టోరీ 4 దర్శకుడు మిలాప్ జావేరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట.  బాలీవుడ్ దర్శకుడు-నిర్మాత ద్వయం ఇటీవల ఎవడు చిత్రాన్ని  చూసారని.. ఈ చిత్రం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగట్లు స్క్రిప్ట్ లో  కొన్ని మార్పులు కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో  అల్లు అర్జున్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మరి హిందీలో రామ్ చరణ్ - అల్లు అర్జున్ పాత్రల్లో ఎవరు నటిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: