యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థకు ఎంతగా బ్యాడ్ టైమ్ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని నెలలుగా రిలీజ్ కావాల్సిన అర్జున్ సురవరం సినిమాను చూస్తుంటేనే అర్థమవుతోంది. ఇలా తన ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అది కార్తికేయ కావచ్చు, కిర్రాక్ పార్టీ కావచ్చు. లేటెస్ట్ గా అర్జున్ సురవరం కూడా కావచ్చు. మంచి కాన్స్ప్ ట్, మంచి ప్రాజెక్టు అయిన

అర్జున్ సురవరం కూడా అలాగే అయింది.  ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనుకున్న ఆ ప్రాజెక్టు, రెడీ టు రిలీజ్ అయి కూడా తెలియని కారణాలతో ఆగిపోయింది. 
దాని తరువాత శ్వాస సినిమా చేద్దాం అంటే అది ఇలా ప్రారంభమై అలా ఆగిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే, కార్తకేయ సీక్వెల్ చేద్దాం అని పీపుల్స్ మీడియాతో కలిసి డిసైడ్ అయ్యారు. కానీ అది కూడా అంత సులువుగా జరిగేలా కనిపించడం లేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఇస్తేనే ముందుకు వెళ్తామని పీపుల్స్ మీడియా సంస్థ స్పష్టం చేసింది. మరో పక్కన దర్శకుడు చందుమొండేటి ఈ ప్రాజెక్టు కన్నా శర్వానంద్ సినిమా మీద ఆసక్తి చూపిస్తున్నట్లు లేటెస్ట్ న్యూస్. శర్వానంద్ కూడా నవంబర్ కి డేట్స్ ఇస్తానని, వెయిట్ చేయమని చందుకు చెప్పినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

అదే నిజమైతే కార్తికేయ 2 ఇక ఇప్పట్లో వుండదని ఫ్రెష్ అప్‌డేట్. ఎందుకంటే శర్వా-చందు సినిమా ఫినిష్ అయి, హిట్ అయితే, చందు చూపు వేరే వైపు వుండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఎందుకునో నిఖిల్ మరో ప్రాజెక్టు వైపు చూస్తున్నట్టు కనిపించడం లేదు. నిజానికి హీరోలు ఎవ్వరూ దొరక్క నిర్మాతలు వెదుకులాడుతున్నారు. కానీ ఇలాంటి టైమ్ లో నిఖిల్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదో అన్నది అతనే ఆలోచించుకోవాలేమో? లేకపోతే ఇంత ఖాళీగా ఎందుకుంటాడు. ఇక ఇదేది అయ్యో పని కాదు అంటే సందీప్ కిషన్‌లా తనే సొంతగా సినిమాని తీసుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: