యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటేస్ట్ గా నటిస్తున్న భారీ సినిమా సాహో. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతోందీ సినిమా. ఆగస్టు 15 విడుదల చేయాలని చిత్ర బృందం డేట్ ను ప్రకటించారు. అందుకనే టీజర్, సాంగ్ ప్రోమో ను వదిలారు. అయితే సినిమా లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ భయంకరంగా పెడుతోందని  తెలుస్తోంది. ఈ సినిమాకు చాలావరకు విఎఫ్ఎక్స్ వర్క్ వుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పెద్ద సమస్య. అన్ని పనులు పూర్తయిపోయాయి. ఫైనల్ ఎడిట్ కూడా జరుగుతోంది. కానీ విఎఫ్ఎక్స్ పనులు మాత్రం పూర్తికావాల్సి వుంది. ఈ పనులు తీసుకున్న కంపెనీల నుంచి అవుట్ పుట్ వస్తే, మిక్స్ చేసుకుని, ఫైనల్ కాపీ రెడీ చేసి, సెన్సారుకు పంపించాలి.

ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయాల్సి వుండడం, ముఖ్యంగా బాలీవుడ్ లో భారీగా విడుదల ప్లాన్ చేయడంతో, ఈ నెలాఖరులోనే సెన్సారు చేయించాల్సిన అవసరం వుందని తెలుస్తోంది. అందుకోసం సాహో టీమ్ బాగా శ్రమిస్తోంది. యువి క్రియేషన్స్ కీలక బాధ్యులంతా తలో పని తమ మీద వేసుకుని పరుగులు పెడుతున్నారట. దీంతో తెలుగు పబ్లిసిటీని కూడా పట్టించుకోవడం కష్టం అవుతోందని తెలుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో ఆగస్టు 15 విడుదల అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని యువి క్రియేషన్స్ చాలా టెన్షన్ పడుతున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ డేట్ మిస్ అయితే ఆర్థికంగా కష్టమే కాకుండా, మంచి డేట్ కూడా మిస్ అయినట్లు అవుతుంది. దీంతో బాలీవుడ్ లో కూడా సమస్యలు వస్తాయి. ఇప్పుడు సాహో ముందువున్న అతిపెద్ద సమస్య ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15కు రావాలన్నదే పనిగా చిత్ర యూనిట్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారట. మరి ఆగస్టు 15కు సాహో వస్తున్నాడా లేదా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: