శర్వానంద్, సుధీర్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రణరంగం సినిమా ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉంది. మొన్నటివరకు టైటిల్ దొరక్క ఈ సినిమాను పక్కనపెట్టారు. ఇప్పుడు టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత కూడా సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది.

ఇప్పటివరకు అనుకున్న ప్రకారం ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేశారు. కానీ ఇప్పుడా తేదీ నుంచి రణరంగం దాదాపు తప్పుకుందని లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తికాలేదట. ఈ 10 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుందనే గ్యారెంటీ కూడా లేదని సమాచారం. దీనికితోడు శర్వానంద్ చెప్పిన కొన్ని మార్పులు చేయడానికి ఇంకాస్త టైమ్ పడుతుందట. అందుకే ఆగస్ట్ 2కు ఈ సినిమా వచ్చేది అనుమానంగానే ఉందని వార్తలు వెలువడుతున్నాయి.

గ్యాంగ్ స్టర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన రణరంగం సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో శర్వానంద్ కనిపించబోతున్నాడు. కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పాటల విడుదల కార్యక్రమం షురూచేశారు. ఇక ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే.   


మరింత సమాచారం తెలుసుకోండి: