అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో  చేయబోతున్న సినిమాకి ఎప్పుడో  స్క్రిప్ట్ పూర్తయిపొయింది.  గత నెల 26న మొదటి షెడ్యూల్ ను కూడా ప్లాన్ చేసింది చిత్రబృందం. కానీ  అఖిల్ కి  హీరోయిన్  ఫైనల్ కాకపోవడంతో..  ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ఈ నెల 15 నుండి ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే  మిగిలిన నటీనటులు గురించి ఓ క్లారిటీ  వచ్చింది. కానీ  హీరోయిన్ మాత్రం సెట్ కావట్లేదు. కొన్నాళ్ళు కియారా అద్వానీ అన్నారు, ఆ తరువాత  రష్మికా మండన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి,  లేదూ,  కొత్త హీరోయిన్ ను ఫైనల్ చేస్తున్నారన్నారు.  తాజాగా  అఖిల్‌కు జోడీగా తమిళ భామ నివేదా పేతురాజ్‌ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదట. 

   

మొత్తానికి అఖిల్ సినిమా స్టార్ట్ కాకుండానే రోజుకొక రూమర్ వస్తోంది. హీరోయిన్ ఫైనల్ అయ్యేదాకా రూమర్లు ఆగేలా లేవు.  మరి 'అఖిల్'కి   హీరోయిన్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో..  'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అఖిల్ కి. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా  అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో.  ఈ  సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్  సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: