ఆగస్టు 15 విడుదల రిలీజ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న ‘సాహో’ కు లాస్ట్ మినిట్ టెన్సన్స్ విపరీతంగా వెంటాడుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఎడిటింగ్ వర్క్ పూర్తి అవుతున్నా ఈమూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఇంకా చాల పెండింగ్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఈపనులు చేస్తున్నా కంపెనీల నుంచి అవుట్ పుట్ వస్తేకాని దానిని మిక్స్ చేసుకుని ఫైనల్ కాపీ రెడీ చేసుకుని సెన్సార్ కు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. 

ఈమూవీ బాలీవుడ్ లో కూడ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ముంబాయ్ సెన్సార్ అధికారుల పద్ధతి ప్రకారం రిలీజ్ కు ముందుగా రెండు వారాలలోపు ఫైనల్ కాపీ సెన్సార్ వర్గాలకు ఇవ్వాలి. ముఖ్యంగా ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో బాలీవుడ్ తో సహా విడుదల చేస్తున్న నేపధ్యంలో ఎట్టి పరిస్తుతులలోను ఈ నెలాఖరులోపే సెన్సారు చేయించాల్సిన అవసరం వుందని తెలుస్తోంది. 

అందుకోసం సాహో టీమ్ కిందామీదా అవుతోంది. యువి క్రియేషన్స్ లోని కీలక వ్యక్తులు అంతా ప్రస్తుతం ఈపనులు మీద పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెన్సన్స్ కారణంగా ‘సాహో’ టీమ్ ఈమూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ పబ్లిసిటీ పై దృష్టి పెట్టడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా కొనసాగుతూ ఉంటే ఈమూవీ ప్రొమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన తొలి పాట ‘సైకో సయ్యా’ పూర్తి వీడియో నిరాశపరిచిన నేపధ్యంలో ఈసినిమా ప్రమోషన్ ను మరింత పక్కాగా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. 

ఈసినిమాకు సంబంధించి ఒక్క ఐటమ్ సాంగ్ మినహా మిగతా మూవీ షూటింగ్ అంతా పూర్తి అయిన పరిస్థుతులలో ఆ ఐటమ్ సాంగ్ ను చివరి నిముషంలో షూట్ చేయాలా వద్దా అన్న ఆలోచనలు ‘సాహో’ టీమ్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే మాస్ ప్రేక్షకులకు ఇలాంటి ఐటమ్ సాంగ్ లు బాగా నచ్చుతాయి కాబట్టి సినిమా నిడివి పెరిగినా పట్టించుకోకుండా ఐటమ్ సాంగ్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నట్లువార్తలు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: