ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 3 త్వరలో రాబోతుంది.  అయితే ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్లకు మంచి ఆదరణ లభించింది.  కాకపోతే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 1 మంచి సక్సెస్ సాధించినా..సెకండ్ సీజన్ పై మాత్రం విమర్శలు వచ్చాయి.  తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ 3 పై విమర్శలు వస్తున్నాయి.

బిగ్ బాస్ 3 నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్  పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా, ఇటీవల యంకర్  శ్వేతారెడ్డి ని బిగ్ బాస్ నిర్వాహకులు తనను ఆడిషన్ కి పిలిచి ఎంపిక చేసినట్లు తెలిపి, తీరా అగ్రిమెంట్ విషయంలో తిరకాసు పెట్టారని..బాస్ ని ఎలా ఇంప్రెస్ చేస్తావ్ అంటూ లైంగిక వేధింపులు చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.  అంతే కాదు బిగ్ బాస్ బ్రోతల్ హౌజ్ లా మారిందని ఘాటైన కామెంట్స్ చేసింది. 

ఇటీవల ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి అధినేత పాల్ పై కూడా ఎన్నో సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా  శ్వేతారెడ్డి  నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా, రవికాంత్‌, రఘు, అభిషేక్‌, శ్యామ్ లపై ఐపీసీ సెక్షన్లు 354 కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించామని బంజారాహిల్స్‌ సీఐ కళింగరావు వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: