వెంకటేష్ కూలి నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టబు నిన్నే పెళ్లాడుతా సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఆ తరువాత నాగ్ తోను, చిరంజీవితోనూ సినిమాలు చేసింది. బాలయ్యతో పాండురంగడు సినిమాలో నటించింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే.
బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. రీసెంట్ గా దే దే ప్యార్ దే సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాలో టబు ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు.
ఈ పాత్ర కోసం టబు భారీగా డిమాండ్ చేసిందట. పాత్ర కీలకం కావడంతో ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అల్లు అర్జున్ సినిమాకు ఆమె ఏకంగా 60 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది పెద్దమొత్తం అనే చెప్పాలి. ఓ క్యారెక్టర్ కు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే గొప్ప విషయమే.
అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నది. ఫాదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు.