యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేసిన సాహో అనుకున్న టైం కు వస్తుందా రాదా అన్న టెన్షన్ చిత్రయూనిట్ లో ఉంది.


షూటింగ్ పార్ట్ ఎప్పుడో పూర్తి కాగా సినిమాకు సంబందించిన వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదట. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా కాబట్టి సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా ప్రాముఖ్య వహిస్తుంది. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే అనుకున్న విధంగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ జరగట్లేదట.  


అందుకే సాహో టీం కు రిలీజ్ టెన్షన్ పట్టుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా సాహోపై నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అయ్యింది.


సాహో సినిమా ప్రభాస్ ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందా.. మరోసారి తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియచేస్తుందా అన్నది తెలియాలంటే మాత్రం ఆగష్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: