జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ రాజు గారి గది సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ తో మరోసారి రాజు గారి గది 2 సినిమా చేశాడు. గది 2లో నాగార్జున, సమంత వంటి స్టార్స్ నటించినా కూడా సినిమాను కాపాడలేదు. ఆ సినిమా ఇచ్చిన షాక్ తో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్నాడు ఓంకార్.


ఇప్పుడు మళ్లీ రాజు గారి గది 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఓంకార్. మిల్కీ బ్యూటీ తమన్నాతో సినిమా ఓపెనింగ్ జరుగగా అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందట. తమన్నా ప్లేస్ లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. అయితే కాజల్ రాజు గారి గది 3కి ఓకే చెప్పిందట. కాని అమ్మడు తన రెమ్యునరేషన్ చుక్కలు చూపించిందట.


ప్రస్తుతం కెరియర్ మంచి ఫాం లో ఉన్న కాజల్ సినిమాకు 1.75 లక్షల నుండి 2 కోట్ల దాకా తీసుకుంటుంది. అయితే ఓంకార్ అంత ఇచ్చి సినిమా తీసే పరిస్థితి లేదు. దర్శక నిర్మాత తనే కాబట్టి సాధ్యమైనంత వరకు కాస్ట్ కటింగ్ చూస్తున్నాడట. కాజల్ చెప్పిన ఫిగర్ తో ఓంకార్ కు మైండ్ బ్లాంక్ అయ్యిందట.


పరిస్థితి చూస్తుంటే కాజల్ కూడా ఈ సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తుంది. కాజల్ ప్లేస్ లో అవికా గోర్, రష్మి ఇలా ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతున్నాయి. మరి ఓంకార్ రాజు గారి గది 3లో హీరోయిన్ ఎవరన్నది అఫిషియల్ గా తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: