మరో వారం రోజుల్లో స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సెలబ్రిటీల ఎంపిక, అగ్రిమెంట్లు పూర్తయినట్లు తెలుస్తుంది. నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. సాధారణంగా బిగ్ బాస్ షో మొదలయ్యాక వివాదాలు ప్రారంభం అవుతాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా ప్రారంభం కాకముందే బిగ్ బాస్ 3 పై వివాదాలు మొదలయ్యాయి. 
 
యాంకర్ శ్వేతా రెడ్డి బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసారు. మీకు బిగ్ బాస్ షోలో చాన్స్ ఇస్తే మా బాస్ ను ఎలా ఇంప్రెస్ చేస్తారని అడిగారని శ్వేతా రెడ్డి చెప్పారు. పోలీసులకు కూడా శ్వేతా రెడ్డి ఈ విషయంపై ఫిర్యాదు చేసారు. కానీ శ్వేతా రెడ్డి ఆరోపణలు చేసినప్పటికీ ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలైతే శ్వేతా రెడ్డి దగ్గర ప్రస్తుతానికి లేవు. సాక్ష్యాలు లేకపోతే ఈ కేసు నిలబడే అవకాశమైతే లేదు. 
 
ఇప్పటికే బిగ్ బాస్ రెండు సీజన్లు తెలుగులో పూర్తయింది. ఎంతోమంది స్టార్ స్టేటస్ ఉన్న సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. కానీ వారు ఈ షో నుండి బయటికి వచ్చాక కూడా ఈ షో గురించి ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలైతే చేయలేదు. కొందరు మాత్రం బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. స్టార్ మా యాజమాన్యం కానీ, బిగ్ బాస్ షో నిర్వాహకులు కానీ ఈ వివాదంపై స్పందిస్తే మాత్రమే అసలు వాస్తవాలు బయటికి వస్తాయి. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: