టాలీవుడ్కు `కుమారి 21F` సినిమాతో పరిచయం అయిన హెబ్బా పటేల్ ఈ ఒక్క సినిమాతో కుర్రకారులో తన అందంతో గుబేలెత్తించింది. కుమారి అనే పేరు యూత్లో హోరెత్తించింది. ఈ సినిమా తర్వాత రెండేళ్లు ఆరు సినిమాలతో ఖాళీ లేకుండా ఇండస్ట్రీని దున్నేసింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తోంది.
హెబ్బా 2016, 2017లో ఆరు సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపిన ఆమె 2018 వచ్చే సరికి ఒక్క సినిమాతో సరిపెట్టుకుంది. 2018లో వచ్చిన `24 కిసెస్` సినిమా కూడా పెబ్బాకు హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో టాలీవుడ్లో స్లో అయిన ఆమెకు తాజాగా క్రేజీ యంగ్ హీరో నితిన్ ఛాన్స్ ఇచ్చాడు. నితిన్ హీరోగా రాబోతున్న ‘భీష్మ’ చిత్రంలో ఒక కీ రోల్ కోసం హెబ్బాను తీసుకున్నారట.
ఈ సినిమాకు ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇప్పటి వరకు హెబ్బా మంచి బ్రేక్ ఇచ్చే సినిమా చేయాలని పట్టుబట్టి కొన్ని అవకాశాలను వదులుకున్న ఆమెకు ఇన్నాళ్లకు మంచి ఛాన్స్ దొరికింది. ఈ సినిమాతో అయిన హిట్ కొట్టి మళ్లీ పట్టాలెక్కుతుందో? లేదో? చూడాలి.