జూలై 26న రిలీజ్ కాబోతున్న డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ ను పీక్స్ లో చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను భరత్ కమ్మ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.


ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తం విజయ్, రష్మిక మీద వేసుకున్నారు. ముఖ్యంగా కన్నడలో ఈ సినిమాను డైరెక్ట్ సినిమాలానే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అందుకే నిన్న కె.జి.ఎఫ్ యశ్ ను గెస్ట్ గా పిలిపించి అక్కడ మ్యూజికల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో విజయ్, రష్మికల డ్యాన్స్ హైలెట్ అని తెలుస్తుంది.


అంతేకాదు యశ్ అండ్ విజయ్ ఇద్దరు కలిసి ఇచ్చిన స్పీచ్ ప్రేక్షకులను అలరించింది. కచ్చితంగా జూలై 26న సౌత్ సిని పరిశ్రమ మొత్తం డియర్ కామ్రేడ్ మూవీ హంగామా చూడబోతుంది. బెంగళూరు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలుస్తుంది. ఇక త్వరలో చెన్నై, హైదరాబాద్, వైజాగ్ లో కూడా ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.       


విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగు యువత జపిస్తున్న నామం. పెళ్లిచూపులు నుండి టాక్సీవాలా వరకు హిట్ హిట్టుకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ డియర్ కామ్రేడ్ తో దుమ్ము దులిపేయాలని డిసైడ్ అయినట్టు ఉన్నాడు. ఇప్పటికే తెలుగులో స్టార్ డం తెచ్చుకున్న విజయ్ సౌత్ అన్ని భాషల్లో క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి డియర్ కామ్రేడ్ ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: